వెంకయ్య హెల్త్ బులిటెన్

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటి దగ్గరే చికిత్స తీసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్యంపై ఉప రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలంటూ కాంక్షించిన అందరికీ వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.తాను బాగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు ఆయన కార్యాలయం నిన్న రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నారని ట్విటర్‌లో తెలిపింది. ఉదయం రొటీన్‌గా కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని, లక్షణాలేమీ లేవంది. వైద్యుల సూచనలతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఆయన సతీమణి ఉషా నాయుడుకు నెగెటివ్‌ రావడంతో ఆమె ఐసొలేషన్‌లో ఉన్నారు.