పటానీ వెనక 40 మిలియన్ల ఫాలోవర్స్ 


బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ విషయంలో ఆమె స్టార్ హీరోయిన్స్ ని దాటేసింది. అలియా భట్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలను బీట్‌ చేసింది. ఏకంగా 40మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. 
2016లో ‘ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’తో బాలీవుడ్‌కు నటిగా పరిచయం అయ్యారు. ‘భారత్‌’లోని ఓ గీతంలో తన డ్యాన్స్‌, అందంతో ఆకట్టుకున్నారు. ‘మలంగ్‌’లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.

ఈ బ్యూటీ తరచూ డ్యాన్స్‌, జిమ్‌ వీడియోలను ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకుంటుంటారు. ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు అనేకమార్లు ఫిదా అయ్యారు. పరిశ్రమకు పరిచయమైన దాదాపు నాలుగేళ్లలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. అయితే అలియా భట్‌, కత్రినా కైఫ్‌, అనుష్క శర్మలు 40మిలియన్ ఫాలోవర్స్ పెంచుకోవడానికి దాదాపు పదేళ్లు పట్టింది. అదే దిశా పటానీకి కేవలం నాలుగేళ్లలోనే ఈ రేంజ్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది.