జోహాన్స్ బ‌ర్గ్ టెస్ట్’లో భారత్ సంచలన విజయం

జోహాన్స్ బ‌ర్గ్ టెస్ట్’లో భారత్ సంచలన విజయం సాధించింది. ఒక వికెట్ న‌ష్టానికి 126 ప‌రుగ‌ల‌తో ప‌టిష్ఠ స్థితిలో ఉన్న సౌతాఫ్రికాను భారత బౌల‌ర్లు పడగొట్టారు. నాల్గోరోజు 17/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా డీన్‌ ఎల్గర్‌, హషీమ్‌ ఆమ్లాలు బాధ్యతాయుతంగా ఆడారు. ఈ జోడి 119 పరుగుల భాగస్వామ‍్యాన్ని జతచేసింది. ఐతే, 124 పరుగుల వద్ద ఆమ్లా(52) రెండో వికెట్‌గా అవుటైన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

డివిలియర్స్‌(6), డుప్లెసిస్‌(2), డీ కాక్‌(0), ఫిలాండర్‌(10), పెహ్లకోవాయా(0) , ర‌బ‌డ‌(0), మోర్కెల్ (0) , ఎన్లు గిడి (4 ) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. దీంతో.. భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. భార‌త్ కు బౌల‌ర్లలో ష‌మి 5 వికెట్లు తీశారు. బూమ్రా, ఇశాంత్ త‌లో రెండు వికెట్లు తీశారు. భువ‌నేశ్వ‌ర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.