ముగ్గురు బాలీవుడ్ హీరోలకు నోటీసులపై ఎన్సీబీ క్లారిటీ 

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో  హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ విచారణని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దీపికతో కలిసి నటించిన ముగ్గురు హీరోలకి ఎన్ సీబీ సమన్లు ఇవ్వనుంది. వారి పేర్లలోని మొదటి అక్షరాలు ‘ఏ’, ‘ఎస్‌’, ‘ఆర్‌’ అనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారంపై ఎన్సీబీ అధికారి ఒకరు స్పందించారు.ఆ వార్తల్లో నిజం లేదు. అది తప్పుడు ప్రచారమని క్లారిటీ ఇచ్చారు.

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా ఆయన  మేనేజర్‌ జయాసాహాని విచారించగా.. ఆమె సెల్‌ఫోన్‌ నుంచి బయటపడిన పలు వాట్సాప్‌ సంభాషణలను ఆధారంగా చేసుకుని దీపిక, ఆమె మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌, సారా, శ్రద్ధాకపూర్లకు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. వారిని విచారించారు. అయితే విచారణలో ముగ్గురు హీరోయిన్స్ దీపిక, శ్రద్దా, సారాలని నిర్థోషులుగా తేలినట్టు ప్రచారం జరుగుతోంది. వారు చాట్ చేసింది డ్రగ్స్ కోసం కాదు. సిగరేట్స్ కోసమని తేలిందని తెలుస్తోంది. ఆ సిగరేట్స్ తాగితే స్లిమ్ గా అవుతారని చెబుతున్నారు.