‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీ బయల్దేరిన ప్రభాస్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగారు. ఆర్నేళ్ల తర్వత ‘రాధేశ్యామ్’ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఇటలీ పయనమయ్యారు.హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ కెమెరాకు చిక్కాడు. ఇప్పుడీ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాజివల్ ఖాకీ టీషర్ట్, బ్లాక్ జీన్స్ వేసుకొని.. సన్ గ్లాస్ పెట్టుకొని స్టయిలీష్ గా నడుచుకుంటూ వెళ్తున్న ప్రభాస్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజా ఇటీలీ షెడ్యూల్ 15రోజుల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ యేడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయనున్నారు. వచ్చే యేడాదిలో ప్రభాస్ రెండు భారీ చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో ఒకటి నాగ్ అశ్విన్ సినిమా కాగా, రెండో ఆదిపురుష్. రెండు పాన్ ఇండియా సినిమాలే. ఒక్కో సినిమా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రాబోతుందని సమాచారమ్.