దేశంలో లక్ష కరోనా మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 64,73,545 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 1,069 మంది మృతిచెందారు. దీంతో మరణాల సంఖ్య 1,00,842కు చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 75,628 మంది కోలుకున్నారు. దీంతో  ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 54,27,707కి చేరింది. మరో 9,44,996 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 83.84 శాతంగా, మరణాల రేటు 1.56 శాతంగా ఉంది.