కరోనా బారినపడలేదు.. ప్రభు !

సీనియర్ నటుడు ప్రభు కరోనా బారినపడ్డారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారం వెనక ఓ కారణం ఉంది. అదేంటీ అంటే.. ? తన తండ్రి నటుడు శివాజీ గణేషన్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం (అక్టోబర్ 1) ఓ స్మారక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పలువురు రాజకీయ ప్రముఖులు దీనికి హాజరయ్యారు.నటుడు ప్రభు మాత్రం కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారని.. క్వారంటైన్‌లో ఉన్నారని.. అందుకే స్మారక కార్యక్రమంలో కనిపించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది.

తాజాగా ఈ ప్రచారంపై ప్రభు క్లారిటీ ఇచ్చారు. ‘నేను కొవిడ్‌-19 బారినపడలేదు. సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇటీవల నా కాలు బెణికింది. దాని కారణంగా నేను స్మారక కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను. ఇప్పుడు నేను ఆర్యోగంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాలో నటిస్తున్నారు.