ఎన్టీఆర్ కోసం కొత్త టీం ?!

‘అజ్ఝాతవాసి’ అట్టర్ ప్లాప్’తో దర్శకుడు త్రివిక్రమ్ అలర్టయినట్టు సమాచారమ్. ఎన్టీఆర్’తో చేయబోయే సినిమా కోసం యంగ్ టీమ్ ని రెడీ చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. ‘అజ్ఝాతవాసి’ విషయంలో కథ కాపీ, దర్శకత్వం కూడా త్రివిక్రమ్ స్థాయిలో లేదని విమర్శలొచ్చాయ్. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ సినిమా విషయంలో రిపీట్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నాడట.

ఇదీగాక, ఇప్పటి వరకు హీరోయిన్ గా అనుకొన్న అను ఇమ్మాన్యూయేల్ స్థానంలో పూజా హెగ్డేని ఫైనల్ చేశారు. ‘అజ్ఝాతవాసి’ ప్లాప్ అను అవకాశాన్ని దూరం చేసిందని చెప్పాలి. మొత్తానికి.. త్రివిక్రమ్ ఎదురైన తొలి పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెలుతుందని ముందు చెప్పారు. కానీ, కాస్త ఆలస్యం అయ్యేలా కనబడుతోంది.