ఏపీలో 6వేల కరోనా మరణాలు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,256 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 7,23,512కి చేరింది. 24 గంటల వ్యవధిలో 38 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,019కి చేరింది. నిన్న ఒక్కరోజులో 7,558 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇక నిన్న కరోనాతో మృతి చెందిన 38 మందిలో జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణా జిల్లాలో ఏడుగురు, చిత్తూరు 5, కడప 5, గుంటూరు 4, విశాఖపట్నం 4, తూర్పుగోదావరి 3, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు.