దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా తెరాస నేత.. ఖరారు !

దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరకు శ్రీనివాస్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. టెక్నికల్ గా ఆయన ఇప్పుడు తెరాస నేత. తెరాస నుంచి దుబ్బాక టీకెట్ ఆశించి భంగపడ్డారు. అదే సమయంలో కాంగ్రెస్ దుబ్బాక టికెట్ ఆపర్ రావడంతో అటు వైపుగా చూస్తున్నారు. గత రెండ్రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డి గురించి తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా సమాలోచనలు చేస్తోంది.

శ్రీనివాస్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కం ఠాకూర్ భేటీ కానున్నారు. అనుచరులు, అభిమానులతో సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిక పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకునే అవకాశం ఉంది  ఆ వెంటనే ఆయన్ని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తెరాస అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకి టికెట్ ఇచ్చారు.