దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి సంచలన కామెంట్స్ 

మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆయన దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. పార్టీ మారిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి తెరాసపై సంచలన ఆరోపణలు చేశారు. గత ఐదేళ్లలో దుబ్బాక ఏమాత్రం అభివృద్ది చెందలేదన్నారు.

దుబ్బాక నియోజకవర్గం అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ఆనాడు తన తండ్రి ముత్యం రెడ్డితోపాటు టీఆర్ఎస్ పార్టీలో చేరామన్నారు. ఎన్నికల్లో తమను ఉపయోగించుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కనీసం తమకు అదికూడా అడగలేదని, దీంతో ముత్యంరెడ్డి కుమిలిపోయి, నిజాయితీ చచ్చిపోయిందని, గుండెపగిలి చనిపోయారని అన్నారు. కనీసం ఏ మీటింగ్‌లకు కూడా తమను పార్టీ పిలవడంలేదని విమర్శించారు.