తెలంగాణలో 1,896 కేసులు, 2,067 రికవరీలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో రికవరీ అవుతున్న వారీ సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,896 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,06,644కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1201కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,067 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,79,075కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,724 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.