NDAలోకి YSRCP.. ప్రత్యేక కండియన్ !

ఎన్డీయేలో వైసీపీ చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 15 రోజుల వ్యవధిలోనే ఏపీ సీఎం జగన్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లడం వెనక కారణమిదేనని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు భాజాపా గానీ, వైసీపీగానీ నోరు తెరవడం లేదు. ఎన్డీయేలో చేరడానికి వైసీపీకి ఎలాంటి అభ్యంతరం లేదట. కానీ కేంద్రం ముందు జగన్ ప్రత్యేక కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. అదే ప్రత్యేక హోదా. అదొక్కటి ఇస్తే ఎన్డీయేలో చేరడానికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఎన్డీయేలో చేరడం ద్వారా ఏపీలో టీడీపీని పూర్తిగా లేకుండా చేయొచ్చు అన్నది జగన్ ప్లాన్ లా కనిపిస్తోంది. అంతేకాదు.. ఇటీవల ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కూడా తలనొప్పులుగా మారాయి. వాటి నుంచి కూడా ఉపశమనం కలుగుతోంది. ఇక వైసీపీతో కేంద్రానికి చాలా పనే ఉంది. రాజ్యసభలో సరైన బలం లేని భాజాపాకు వైసీపీ సపోర్ట్ అంత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే జగన్ పెడుతున్న ప్రత్యేకమైన కండిషన్ పై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారమ్.