గుడ్ న్యూస్ : ఉపాధ్యాయ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్ పై జగన్ సంతకం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెబుతున్నారు.  29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు అని తెలిసింది.

ఈ బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేపట్టనున్నారు. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న టైమ్ లోనూ సీఎం జగన్ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్పాలి.