తెలంగాణలో 1,717 కొత్త కేసులు, 2,103 మంది రికవరీ !

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో  1,717 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1.222కి చేరింది.
 
నిన్న ఒక్క రోజే  2,103 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,85,128కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,713 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,209 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.