టీఆర్ఎస్ కార్యకర్తని చంపిన మావోయిస్టులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురంలో తెరాస కార్యకర్త మాడూరి భీమేశ్వర్‌(48)ను మావోయిస్టులు హత్య చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఆరుగురు మావోయిస్టులు భీమేశ్వర్ ని కత్తులతో పొడిచి చంపేశారు. కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా పట్టించుకోలేదు.

సామాన్య ప్రజలపై మావోయిస్టులు హత్యాకాండ కొనసాగిస్తున్నారని ములుగు ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు మావోయిస్టులు భీమేశ్వర్‌ను పార్టీ ఫండ్‌ అడిగారని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది.