మాఫియా గ్యాంగ్‌ నన్ను చంపేస్తారు.. సాయం చేయండి  !

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ నటి పాయల్ ఘోష్‌ ఇటీవల ముంబయిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనురాగ్ నుంచి తనకి ప్రాణహాని ఉందని మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్దిని కలిశారు.

తాజాగా ఆమె తనకి రక్షణ కల్పించాని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్ చేశారు. బాలీవుడ్‌లోని ఇతర నటీనటుల్లా నా మృతి కూడా ఓ మిస్టరీగా మారిపోయేలా ఉంది. ఆ మాఫియా గ్యాంగ్‌ నన్ను చంపేస్తుంది. నా చావుని ఆత్మహత్యగా ఆ గ్యాంగ్‌ చిత్రీకరిస్తుంది. కాబట్టి ప్రధాని నరేంద్రమోదీజీ, అమిత్‌ షాజీ దయచేసి నాకు సాయం చేయండి’ అంటూ పాయల్‌ రాసుకొచ్చారు.