దేశంలో 66,732 కొత్త కేసులు, 816 మరణాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటలలో దేశంలో 66,732 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71,20,539 చేరింది. నిన్న ఒక్కరోజే 816 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,09,150కి చేరింది.

నిన్న ఒక్కరోజే  71,559 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 61,49,536కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,61,853 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక దేశంలో 86.36 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉంది. అలానే దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.53 శాతానికి మరణాల రేటు తగ్గింది.