యూపీలో మరో దారుణం.. చెరకు తోటలో శవమై తేలిన బాలిక !

యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. హాథ్రస్ ఘటన మరవకముందే.. అలాంటి మరో ఘటన వెలుగులోనికి వచ్చింది. యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పసాగవాన్ గ్రామంలో తప్పిపోయిన టీనేజ్ బాలిక చెరకుతోటలో శవమై కనిపించింది. ఆమె మెడపై గాయం గుర్తులు ఉన్నాయి. దీంతో.. బాలికని అత్యాచారం చేసి.. హత్య చేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బాలిక మృతదేహం లభించిన సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణులు, క్రైంబ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. మరోవైపు బాలిక తప్పిపోయిన రోజునే.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. తమకి ఊరిలో ఎవరితో శతృత్వం లేదని వారు ఫిర్యాదులో తెలిపినట్టు తెలుస్తోంది.