ఐపీఎల్ : మళ్లీ టాప్’లోకి ముంబై

ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై.. ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (69*; 52 బంతుల్లో 6×4, 1×6), శ్రేయస్ అయ్యర్ (42; 33 బంతుల్లో, 4×4, 1×6) రాణించారు.

అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. డికాక్‌ (53; 36 బంతుల్లో 4×4, 3×6), సూర్యకుమార్‌ (53; 32 బంతుల్లో, 6×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఈ విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రోహిత్‌ సేనకు వరుసగా ఇది నాలుగో విజయం.