ఏపీ మంత్రి వెల్లంపల్లి ఆరోగ్యం విషమం


ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ని హుఠాహుఠిన హైదరాబాద్ కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా వెల్లపల్లికి శ్వాస సమస్యలు రావడంతో.. అధికారులు అప్పటికప్పుడు సీఎంవోను సంప్రదించారు. ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఉంచే ప్రత్యేక విమానాన్ని అప్పటికప్పుడు సిద్ధం చేసి.. హైదరాబాద్‌కు తరలించారు. ప్రసుత్తం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కొద్ది రోజుల కిందట మంత్రి వెల్లంపల్లి కరోనా బారిన పడ్డారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే వరకూ వారం రోజుల పాటు అక్కడే గడిపి వచ్చిన తర్వాత ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజుల చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యా కానుక పథకం లో భాగంగా విద్యార్థులకు బ్యాగులు ఇచ్చే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున పట్టువస్త్రాలు సమర్పించేందుకు రావాలంటూ.. ఆయన ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు రెండు రోజుల కిందట కలిశారు. ఆ తర్వతా ఆయనకు ఆనారోగ్యం తిరగబెట్టింది. అది కాస్త బుధవారం సీరియస్ అయింది.