దేశంలో 63,371 కేసులు, 70,338 రికవరీ 

దేశంలో కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో.63,371 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 895 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,161కి చేరింది.

నిన్న దేశ వ్యాప్తంగా 70,338 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 64,53,779 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 8,04,528 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో రికవరీ రేటు పెరుగుతోంది. దాదాపు 87.56 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో కేవలం 10.92 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులున్నాయి. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది.