త్వరలో శింబు-త్రిషల పెళ్లి !

ఏం మాయ చేశావే – గౌతమ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో వచ్చిన చిత్రమిది. తెలుగు వర్షన్ లో నాగ చైతన్య-సమంత నటించారు. ఈ సినిమా సమయంలో వీరి మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లారు. దంపతులుగా మారారు. ప్రస్తుతం బెస్ట్ కపుల్స్ అనిపించుకుంటున్నారు. ఇక ‘ఏం మాయ చేశావె ‘ తమిళ్ వర్షన్ లో శింబు-త్రిష జంటగా నటించారు. ఇప్పుడు ఈ జంట కూడా పెళ్లి చేసుకోనుందని సమాచారమ్. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడది పెళ్లి వరకు వచ్చినట్టు తెలిస్తోంది.

లాక్‌డౌన్‌ సమయంలో త్రిష-శింబు కలిసి ‘కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై శింబు తండ్రి రాజేందర్ ని మీడియా ప్రశ్నించింది. ఆయన సమాధానం చెప్పలేదు. దాటవేశారు. ఏమి  లేకుంటే ఆయన ఖండించే వారు కదా.. ! శింబు-త్రిషల ప్రేమ, పెళ్లి నిజమేనని ప్రేక్షకులు చెప్పుకొంటున్నారు.