చెన్నైతో మ్యాచ్ ఢిల్లీ టార్గెట్ 180


ఐపీఎల్ లో భాగంగా ఈరోజు రెండో మ్యాచ్ చెన్నై-ఢిల్లీ జట్ల మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.  అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో; 6×4, 2×6), వాట్సన్‌ (36; 28 బంతుల్లో, 6×4) రాణించారు.

ఆఖర్లో జడేజా (33*, 13 బంతుల్లో, 4×6) కూడా సిక్సర్లతో చెలరేగాడు. ఆఖరి అయిదు ఓవర్లలో చెన్నై 57 పరుగులు చేసింది. దిల్లీ బౌలర్లలో నోర్జె రెండు వికెట్లు, రబాడ, దేశ్‌పాండే చెరో వికెట్‌ తీశారు. 180 లక్ష్యం ఢిల్లీ చేధించడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే విలువైన భాగస్వామ్యాలు అవసరం. కుర్రాళ్లతో ఢిల్లీ పటిష్టంగా ఉంది. మరీ.. ధోని ఎత్తులని చిత్తు చేస్తూ ఢిల్లీ విజయం సాధిస్తుందా ? అన్నది చూడాలి.