ఇటలీలో ‘రాధేశ్యామ్’కు ఇబ్బందులు


ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్-పూజాలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్ సందర్భంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నామని పూజాహెగ్డే తెలిపింది.

‘ఇటలీలో చిన్న సెట్‌ వేసుకుని.. అతి తక్కువ మంది బృందంతో జాగ్రత్తలు పాటిస్తూ షూట్‌ చేస్తున్నాం. ప్రతిరోజూ సెట్‌లోకి అడుగుపెట్టే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాం. సెట్‌లో ఉన్నంతసేపు మాస్క్‌ ధరిస్తున్నాం. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్క్‌ తీస్తున్నాం. ఇటలీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. షూట్‌ ప్రారంభించిన మొదటి రెండు రోజులు భయం, ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది’ అని పూజా చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. రాధేశ్యామ్ కథ, అందులో తన పాత్రపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేయడం లేదు. పురాణాల్లో చూపించిన ‘రాధ’ పాత్రను పోషించడం లేదు. కానీ  చారిత్రాత్మకమైన ప్రేమికులే మాకు స్ఫూర్తి అని తెలిపింది.