పప్పూసేనకు నాపై అభిమానం ఎక్కువ : కంగనా 

బాలీవుడ్ నటి కంగన, ఆమె సోదరి రంగోలీ సోషల్‌మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా పోస్టులు పెడుతున్నారని పేర్కొంటూ ఇటీవల ఓ వ్యక్తి బాంద్రా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. సమగ్ర విచారణ అనంతరం కంగన, రంగోలీపై కేసు నమోదు చేయాలని  ముంబై కోర్టు ఆదేశించింది. దీంతో ముంబయి పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కంగనా శివసేనని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది.

‘నవరాత్రి రోజున ఎవరెవరు ఉపవాసం ఉంటున్నారు ? దుర్గాపూజ అనంతరం నేను కూడా ఉపవాసం చేస్తున్నాను. నాపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. చూస్తుంటే పప్పూసేనకు నాపై అభిమానం ఎక్కువగా ఉన్నట్లు ఉంది. అందుకే నన్ను వదల్లేకపోతున్నారు. నన్ను ఎక్కువగా మిస్‌ కాకండి. త్వరలోనే నేను అక్కడికి వస్తా’ అని కంగన వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది.