పాపం.. బంగారం పాపపై ట్రోలింగ్ !

సనూష – గుర్తుందా ? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్‌ సోదరి వింధ్య పాత్రలో నటించింది. ఇటీవల నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ చిత్రంలో సనూష జర్నలిస్ట్‌ రమ్య పాత్రలో కనిపించారు. ఆమె ఇటీవల డిప్రెషన్స్ లోకి వెళ్లారట. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత వైద్యుడి దగ్గర చికిత్స తీసుకొని నెమ్మదిగా కోలుకుందట.ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ  ఈ విషయాలు పంచుకున్నారు. దీంతో ఆమెపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ పై సనూష స్పందించారు.  నా మానసిక ఆరోగ్యం గురించి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పినందుకు పలువురు నెటిజన్లు నాపై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. మానసిక కుంగుబాటుతో ఇబ్బందిపడేవాళ్లు.. నా వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే నేను ధైర్యంగా మాట్లాడగలిగాను’ అని ఆమె అన్నారు. అయితే సనూష ప్రయత్నాన్ని అర్థం చేసుకోని నెటిజన్స్ మాత్రం ఆమెపై ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.