హైదరాబాద్ వర్షాలు.. ప్రతి ఇంటికి రూ.10వేల పరిహారం !

హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వర్షాలు, వరదనీటి ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10వేలు చొప్పు ఆర్థికసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు.

పేదలకు సాయం అందించేందుకు పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని తెలిపారు. కష్టాల పాలయ్యే వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని, అంతకు మించిన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి పదివేల రూపాయల చొప్పున రేపు ఉదయం నుంచే అందించాలని స్పష్టంచేశారు. నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగాలని సీఎం ఆదేశించారు.