ఏపీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా 

ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,918 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు చేరింది. నిన్న ఒక్కరోజే 24 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,453కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 35,065 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా మరో 4,303 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మృతి చెందినవారిలో చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో నలుగురేసి చొప్పున మరణించారు. కడపలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.