బిగ్ బాస్’లోని సభ్యులు జంతువులు.. కుమార్ సాయి షాకింగ్ కామెంట్స్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలని పూర్తి చేసుకుంది. ఆరోవారం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యారు.బయటికొచ్చిన కుమార్ సాయి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బిగ్ బాస్ గురించి ఆసక్తికర, షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడమే తనకి పెద్ద మైనస్ అయింది. తనని ఇంట్లోని వారు కలుపుకోలేదని వాపోయాడు.

నన్ను ఎవరు కూడా కలుపుకోలేదు. నిజానికి మనుషులు అయితే అలా కొత్తగా వచ్చిన వారిని దూరం పెట్టి కావాలని టార్గెట్ చేయరు. జంతువులు మాత్రమే అలా చేస్తాయి. వీళ్ళు అలా చేశారు అనడం లేదు కానీ.. నా విషయంలో మాత్రం నన్ను దూరంగా ఉంచినట్లు అనిపించింది. నేను ఏదో అవసరం కోసం బలవంతంగా స్నేహం చేసే వ్యక్తిని అయితే కాదు. కానీ హౌజ్ లో అందరితో ఫ్రెండ్ లాగా ఉండాలని చాలా ట్రై చేశాను. కానీ సెట్టవ్వలేదు. 

ఇక బిగ్ బాస్ లో అతి కష్టమైనా పని ఏమిటంటే.. అప్పటివరకు ఫ్రెండ్ లాగా ఉన్న వారిని ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాల్సి వస్తోంది. అప్పుడే అసలు రంగు బయటపడుతుంది. అయితే బిగ్ బాస్ హౌజ్ లో నేను గేమ్ లానే ఆడాను. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ స్నేహితులను నామినేట్ చేయకుండా నన్ను స్పెషల్ గా టార్గెట్ చేశారు. అదే తనని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికొచ్చేలా చేసిందన్నారు కుమార్ సాయి. ఇక కుమార్ సాయికి నాగ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలోనే నాగ్ కు కుమార్ సాయి కథని చెప్పబోతున్నారు.