దుబ్బాక పోరులో 23 మంది.. పోటీ మాత్రం.. !!

దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్స్ ఉపసంహరణ గడువు నిన్నటి (సోమవారం)తో ముగిసింది. మొత్తంగా 23 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు కాగా.. స్క్రూటినీలో 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మరో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

టీఆర్‌ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బిగ్‌బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో నిలిచారు. మరో నలుగురు అభ్యర్థులు చిన్న పార్టీల నుంచి బరిలో నిలిచారు. ఇక, మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అయితే పోటీలో 23 మంది అభ్యర్థులున్నా.. ప్రధానంగా పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్, భాజాపాల మధ్య ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.