దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా తగ్గుదల

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో రికవరీ అవుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,791 కొత్త కేసులు నమోదయ్యాయ్. గడిచిన మూడు నెలల్లో 50,000 లోపు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,97,064కు చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనా కాటుకు 587 మంది బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,15,197 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 69,720 మంది డిశ్ఛార్జి కావడంతో.. ఇప్పటి వరకూ 67,33,329 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,48,538 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 8.26 శాతం రికవరీ రేటు ఉంది. కేవలం 10.23 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులున్నాయి.  మరణాల రేటు 1.52 శాతంగా ఉంది.