గుడ్ న్యూస్.. ఏపీలో డబుల్ రికవరీ !

కరోనా నుంచి తెలుగు రాష్ట్రం ఏపీ కోలుకుంటోంది. కొత్త కేసులతో పోలిస్తే రికవరీ అవుతున్న వారి సంఖ్య డబుల్ గా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 3,746 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య  7,93,299కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 27 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,508కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 7,739 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,54,415కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,376 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న కృష్ణా జిల్లాలో ఐదుగురు కరోనాతో మృతి చెందగా.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.