దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్


విజయవాడన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా బుధవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు.

అంతకుముందు కొండమీదకు చేరుకున్న సీఎం జగన్‌ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. దుర్గగుడి అభివృద్ధికి సీఎం జగన్ రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు.