కోల్‌కతాపై బెంగళూరు ఘన విజయం 

ఐపీఎల్ లో భాగంగా బుధవారం అబుదాబి వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. సిరాజ్‌ (3/8) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 84 పరుగులే చేసింది. ఇయాన్ మోర్గాన్ (30; 34 బంతుల్లో, 1×4, 1×6) టాప్‌ స్కోరర్‌.

అనంతరం బరిలోకి దిగిన బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలోనే స్వల్ప లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్‌కు చేరువైంది. ఉత్తమ ప్రదర్శన చేసిన సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.