గుడ్ న్యూస్ : కరోనా నుంచి దేశం కోలుకుంటోంది.. !

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. దేశంలో కరోనా కేసులు మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 36,469 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,46,429గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 488 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,19,502కి చేరింది.

నిన్న దేశ వ్యాప్తంగా 63,842 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 72,01,070 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 6,25,857 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య 40 వేల దిగువకు చేరడంతో దేశ వ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య భారీగానే తగ్గుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 90.23 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 8.26 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని బులిటెన్‌లో పేర్కొంది.