తెలంగాణలో 1,504 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 1,504 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,656కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,324కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,436 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,16,353కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,979 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,938 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 288 కేసులు నమోదయ్యాయి.