ప్లేఆఫ్స్.. తొలి బెర్త్ ముంబైదే !

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును ముంబై 5వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌(74; 45 బంతుల్లో 12×4, 1×6), జోష్‌ ఫిలిప్‌(33; 24బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. కోహ్లీ(9), డివిలియర్స్‌(15), దూబె(2), క్రిస్‌మోరిస్‌(4) విఫలమయ్యారు. చివర్లో గురుకీరత్‌(14), వాషింగ్టన్‌ సుందర్‌(10) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.1 ఓవర్లలో అయిదు వికెట్ లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ (79*; 43 బంతుల్లో, 10×4, 3×6) అజేయ అర్ధశతకంతో విజృంభించాడు. డికాక్‌ (18; 19 బంతుల్లో, 1×6), ఇషాన్‌ కిషన్‌ (25; 19 బంతుల్లో, 3×4, 1×6), సౌరభ్‌ తివారి (5; 8 బంతుల్లో). కృనాల్ పాండ్య (10; 10 బంతుల్లో, 1×4), హార్దిక్‌ (17; 15 బంతుల్లో, 2×6) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో చాహల్‌, సిరాజ్‌ చెరో రెండు వికెట్లు, మోరిస్‌ ఒక వికెట్‌ తీశాడు.