జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. అధికారుల నియామకం !

త్వరలోనే జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్ అధికారులను నియమించింది. గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. దీంతో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. రిజర్వ్‌లో 61 మంది రిటర్నింగ్ అధికారులు, 71 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.

మరోవైపు గ్రేటర్ లో పోరు కోసం పార్టీలు రెడీ అవుతున్నాయ్. గ్రేటర్ లో మరోసారి సత్తాచాటాలని అధికారి టీఆర్ ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ సారి ఎలాగైనా తెరాస జోరుకు బ్రేకులు వేయాలని భాజాపా, కాంగ్రెస్ లు ప్లాన్ చేస్తున్నాయ్. గ్రేటర్ లో చతుర్ముఖ పోటీ ఉండనుంది. తెరాస, భాజాపా, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య పోటీ ఉండనుంది.