మెగా కవిత.. అదిరింది !

మెగాస్టార్ చిరంజీవి కరోనా లాక్‌డౌన్ టైమ్ లోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి పర్సనల్, సినిమాలకి సంబంధించి ఆసక్తికర విషయాలని ప్రేక్షకులని పంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగానే కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. తాజాగా మెగాస్టార్ తన  ఇన్ స్టా గ్రాములో ఓ వీడియోని షేర్ చేశారు. ఇంట్లోని పూలకుండీల ఫోటోలని షేర్ చేశాడు.

ఓ ఫోటోలో ప్రభాత సమయంలో మందార పువ్వు వికసించి ఉండగా, దానిని ఉద్ధేశించి ప్రభాత సౌందర్యాన్ని వొడిసి పట్టుకుని, మా ఇంటి మందారం తన కొప్పుని సింగారించింది .. అలవోకగా నా కెమెరా కంటికి చిక్కి అంతర్జాలానికి తన అందం తెలిసింది! అని కామెంట్ పెట్టారు. మెగాస్టార్ షేర్ చేసిన ఫోటో, దానికి ఆయన పెట్టిన కామెంట్ రెండూ ఆకట్టుకుంటున్నాయి.

ప్రసుత్తం మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు, కాజల్ హీరోయిన్. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కరోనా లాక్‌డౌన్ తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఆచార్య తర్వాత లూసిఫర్, వేదాళం రిమేక్ లలో చిరు నటించనున్నారు.