తెలంగాణలో 1,445 కరోనా కొత్త కేసులు

కరోనా నుంచి తెలంగాణ క్రమంగా కోలుకుంటోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,445 కొత్త కేసులు నమోదయ్యాయ్. అదే సమయంలో 1,486 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసులు, రికవరీ దాదాపు సమానంగా ఉంటుంది.

తెలంగాణలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,38,632కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,336కి చేరింది. కరోనాబారి నిన్న ఒక్క రోజే 1,486 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,18,887 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,409 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 15,439 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.