డ్రగ్స్ కేసు : పరారీలో దీపికా మేనేజర్ 

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి కీలకంగా ఉన్న దీపిక పదుకోనె టాలెంట్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ పరారైంది. సుశాంత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రియా చక్రబొర్తిని అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. అదే టైమ్ లో కరిష్మా ప్రకాష్ వాట్సాప్ ఛాట్స్ బయటపడ్డాయి. వాటి ఆధారంగా దీపిక, సారా, రకుల్, శ్రద్ధాకపూర్లను విచారించారు.

అయితే గతవారం ముంబయిలోని వెర్సోవాలో కరిష్మా ప్రకాష్ నివాసంలో ఎన్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో సీక్రెట్ గా దాచిన 1.7 గ్రాముల నిషేధిత మాదకద్రవ్యాల్ని కనుగొన్నారు. దాన్ని సీజ్ చేసిన అధికారులు.. విచారణకు హాజరుకావాల్సిందిగా అదే రోజు నోటీసులు ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి కరిష్మా కనిపించడం లేదు.

ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. మెయిల్ కు స్పందించడం లేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని తెలుస్తోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న కరిష్మా ప్రకాష్ ఇప్పుడు కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమెని ఎవరైనా ఏమైనా చేశారా ? లేక.. ఆమెని కావాలని తప్పించుకు తిరుగుతుందా ?? అన్నది తెలియాల్సి ఉంది.