బెంగళూరుతో మ్యాచ్ హైదరాబాద్ టార్గెట్ 121

ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ని బెంగళూరుకు అప్పగించిన  హైదరాబాద్ ఆ జట్టుని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది.

బెంగళూరు బ్యాట్స్ మెన్ లలో జోష్ ఫిలిప్ 31 (30 బంతుల్లో) టాప్ స్కోరర్. ఏబి డిలివియర్స్ 24, సుందర్ 21, గురుకీరత్ సింగ్ 15 పరుగులు చేశారు. కెప్టెన్ కోహ్లీ 7 పరుగులు మాత్రమే చేశారు. హైదరాబాద్ బౌలర్లు మొదటి నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఏ బ్యాట్స్ మెన్ ని క్రీజులో నిలదొక్కుకొనే ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో.. 120 పరుగులకే బెంగళూరు పరిమితం అయింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్ చెరో 2 వికెట్లు, నటరాజన్, నదీమ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.