షాక్ : పీవీ సింధు రిటైర్మెంట్ ప్రకటన

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు షాకింగ్ ట్విట్ చేసింది. మొత్తం మూడు పేజీల లేఖ లాంటిది తన ట్విట్టర్ ఖాతలో షేర్ చేసింది సింధు. మొదటి పేజీలో  ‘ఐ రిటైర్’ అని టైటిల్ పెట్టింది. దీంతో ఆమె రిటైర్ అవుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ మిగతా రెండు పేజీల్లో మాత్రం వేదాంతం వల్లించింది.

తాను నెగెటివిటికి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే వచ్చే ఏడాది ఆసియా  కప్ వరకూ బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఆడట్లేదని మాత్రం క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజుల కిందట.. గోపీచంద్‌తో పాటు తల్లిదండ్రులతోనూ పీవీ సింధు గొడవపడి లండన్ వెళ్లిపోయిందని ఓ ఇంగ్లిష్ పత్రికలో వార్త వచ్చింది. దాన్ని సింధు ఖండించింది. తన కోసం జీవితం త్యాగం చేసిన వాళ్లపై తానెందుకు అలుగుతానని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మెరుగైన ఫిట్ నెస్ కోసమే లండన్ వచ్చానని చెప్పుకుంది.

అయితే వచ్చే యేడాది ఆసియా కప్ వరకు బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఆడట్లేదని ప్రకటించిన సింధు.. ఫిట్నెస్ కోసమే లండన్ వెళ్లానని చెప్పడం సింక్ కావడం లేదు. మొత్తానికి.. పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్లో ఒత్తిడికి గురవుతున్నారన్న విషయం అర్థమవుతుందని అంటున్నారు.