దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజూవారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 38,310 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో 58,323 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 82,67,623కు చేరుకోగా.. ఇప్పటి వరకు 76,03,121 మంది రికవరీ అయ్యారు. నిన్న ఒక్కరోజే కరోనాతో 490 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య1,23,097కి చేరింది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 5,41,405గా ఉన్నాయి.. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 91.96 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది.