కేసీఆర్’కు అరవింద్ వార్నింగ్

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ధీమాతో ఉంది తెలంగాణ భాజాపా. ఆ తర్వాత వెంటనే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘వందల శవాలు తిన్న రాబంధువట ఒక గాలివానకు కొట్టుకుపోయిందట. గదే అయితిది ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్లల్ల. సుమా.. కేసీయారు.. ఇగ నీకు పోయే కాలం దగ్గరపడ్డది. చాన కష్టకాలం చూస్తవ్ రానున్న సమయంలో. తెలంగాణ ప్రజలు నిన్న మాములుగా.. నిన్ను, నీకొడుకుని ఇబ్బంది పెట్టరు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సలకల ఎనకల కూడా చూస్తరు. పక్కా గుర్తుపెట్టుకో.. మొన్న గాలివానలొచ్చాయ్. కార్లు కొట్టుకుపోయాయ్. దుబ్బాకలో ఓట్ల ద్వారం వచ్చి.. ఆడ నీ నీ పార్టీ సింబల్ ఏదైతే ఉన్నది.. ఆ కారు కొట్టుకుపోతది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో మెసేజ్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 

అయితే అరవింద్ అరుపులపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ్. దుబ్బాక లో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేస్తున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత పువ్వుల చెవ్వులు మూసుకుపోతాయని.. చెప్పుకొంటున్నారు.