పవన్’పై నిర్మాతల ఒత్తిడి ?

‘వకీల్ సాబ్’తో రీ-ఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమా తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలని లైన్ లో పెట్టేశారాయన. వీటిలో ఏదీ ముందు ? ఏదీ వెనక ?? అన్నది మాత్రం క్లారిటీ లేదు. మైత్రీ మూవీస్-పవన్, ఎఎమ్ రత్నం-పవన్ సినిమాలు ఎప్పటి నుంచో బాకీ ఉన్నాయి. వీటికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ ఎప్పటి నుంచి మొదలవుతాయ్ అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మైత్రీ టీమ్ బుధవారం పవన్ ని కలిసినట్టు తెలిసింది. 

వాస్తవానికి వకీల్ సాబ్ తర్వాత పవన్ క్రిష్ సినిమా చేయాలి. ఆ తర్వాత హరీష్ శంకర్ (మైత్రీ మూవీస్), సురేందర్ రెడ్ది.. ఇలా క్యూలో ఉన్నారు. అయితే అయ్యప్పన్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ డిసెంబర్ లో పూర్తికానుంది.  తర్వాత అయ్యప్పన్ రిమేక్ లో నటించనున్నారు పవన్. ఇది పూర్తవ్వడానికి వచ్చే యేడాది ఏప్రిల్ వరకు పట్టొచ్చు. ఆ తర్వాత క్రిష్ సినిమా బ్యాలెన్స్ పూర్తి చేయాలి.

ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉండనుంది. ఈ నేపథ్యంలోనే కరోనా తరువాత బయటికొచ్చి వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ ని మైత్రీ టీమ్ మొత్తం వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసి వచ్చారు. ఈ టీమ్ లో నిర్మాతలు నవీన్, రవి, దర్శకుడు హరీష్ శంకర్ వున్నారు. పవన్ నుంచి వీరికి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.