జియో రూ. 49కు అన్ లిమిటెడ్ కాల్స్

జియో సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. రూ. 49 సరికొత్త ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఈ ప్యాకెజీలో 28రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, 1 గిగాబైట్ డేటా అందించనున్నారు. తొలుత ఈ ఆఫర్ ని కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే వరిస్తుందని తెలిపారు. ఇప్పుడు జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ప్లాన్ వాడుకోవచ్చని వెల్లడించింది.

ఇప్పటికే జియో దెబ్బకు ఇతర టెలికం సంస్థలు గజగజ వణికిపోతున్నాయి. జియో మాత్రం సరికొత్త ప్యాకేజీలతో కస్టమర్స్ ని ఆకట్టుకొంటోంది. ఇటీవలే రిపబ్లిక్ డే కానుకగా అన్నీ సమీక్షించిన ప్యాకేజీలపై 50శాతం డేటాను అదనంగా ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా రూ. 49 ప్యాకేజ్ తో సామాన్యుడికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసోంది.