తెలంగాణలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతున్నాయ్. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయ్. నిన్న కొత్తగా 1,062 మందికి పాజిటివ్‌ తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,47,284కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,366కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 982 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,26,646కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,272 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 16,522 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.