మళ్లీ.. పూరితో చరణ్.. !!

రామ్ చరణ్’ను ‘చిరుత’గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ తర్వాత వీరి కలయికలో మరో సినిమా రాలేదు. ఐతే, ఇప్పుడు చరణ్’తో ఓ సినిమా చేసేందుకు పూరి రెడీ అయినట్టు సమాచారమ్. ప్రస్తుతం పూరి తనయుడు ఆకాష్ సినిమా ‘మెహబూబా’తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే చరణ్’తో సినిమా చేయబోతున్నట్టు చెప్పుకొంటున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ ‘రంగస్థలం’ షూటింగ్ ని పూర్తి చేసి బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కెతోన్న సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఐతే, బోయపాటి సినిమా తర్వాత చరణ్ పూరితో జకట్టేందుకు రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.

చరణ్ కంటే ముందు పూరి విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి. మరీ.. పూరి తదుపరి సినిమా వెంకీ, చరణ్ లలో ఎవరితో ఉండనుంది అనేది ఆసక్తిగా మారింది.